Ms
Ms

Ms

      |      

Người đăng ký

   Những video mới nhất

Ms
5 Lượt xem · 24 ngày trước kia

మెనోపాజ్ అంటే భయం కాదు అవగాహన ఉంటే ఆరోగ్యమే. ఇవాల్టి కిరణ క్యూర్ ప్రోగ్రాంలో సీనియర్ గైనకాలజిస్ట్ మణికర్ణిక మెనూ పాస్ గురించి వివరించనున్నారు

Ms
1 Lượt xem · 2 tháng trước kia

ఎన్ని సమస్యలకు సరికొత్త ఆశ లేజర్ ట్రీట్మెంట్

Ms
15 Lượt xem · 3 tháng trước kia

వైట్ డిస్చార్జ్ కు ఫుల్ స్టాప్ డాక్టర్ మణికర్ణిక మరియు డాక్టర్ ఆశ

Ms
5 Lượt xem · 3 tháng trước kia

⁣ఆర్టీవో దామోదర్ నాయుడు వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కొంతమంది ఏపీకే ఫైల్స్ ద్వారా చలాన్లు చెల్లించాలని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటువంటి నకిలీ యాప్‌లను నమ్మకూడదని, గూగుల్‌లో అధికారిక గవర్నమెంట్ వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించి చలాన్లు చెల్లించాలని సూచించారు.
వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, అధికారిక వెబ్‌సైట్ ద్వారా చలాన్ చెల్లించడం ద్వారా మోసాల నుండి రక్షణ పొందవచ్చని ఆయన వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆన్‌లైన్ సేవలను సురక్షితంగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Ms
22 Lượt xem · 3 tháng trước kia

సావిత్రిబాయి పూలే బ్రిటిష్ వారితో మానవహక్కుల కోసం మహిళ విద్యాభివృద్ధి కోసం అంటరానితనం మీద ఎన్నో పోరాటాలు చేసి మహిళలు విద్య నేర్చుకోవాలని పోరాడిన వ్యక్తి

Ms
8 Lượt xem · 3 tháng trước kia

మహిళల శక్తికి హాట్సాఫ్ ఎమ్మెస్ న్యూస్ హ్యాట్సాఫ్ ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహించారు

Ms
16 Lượt xem · 4 tháng trước kia

తిరుమల కల్తీ నెయ్యి సరఫరాలో వైష్ణవి డైరీ పొనబాక వద్ద జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రెస్ ట్ నిర్వహించి మీడియాతో మాట్లాడిన ఉయ్యాల ప్రవీణ్

Ms
6 Lượt xem · 4 tháng trước kia

⁣*మెంబర్షిప్ టు లీడర్షిప్ దిశగా మనమందరం కృషి చేయాలి జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం*
శ్రీకాళహస్తి నియోజకవర్గం లో తొట్టంబేడు మండలంలోనీ నాయకులందరూ కలిసి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసి, గ్రామ గ్రామాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లే విధంగా, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులందరూ కూడా కలిసి మాట్లాడుకోవడం జరిగింది, నాయకులందరూ జనసేన పార్టీ అభివృద్ధి కోసం దృఢమైన సంకల్పంతో బాధ్యతగా పనిచేయడమే మా లక్ష్యం అని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, తేజ, గంధం శీను, నాదెండ్ల రాజేష్, మహేష్, లక్ష్మణ్, హరి, మనీ, ప్రదీప్ కుమార్, నవీన్,కల్లపూడి వెంకటేష్, శాంతి కుమార్, రమేష్ బాబు, సాయి, భాను, ముని చంద్ర, జానీ, నాగరాజు, చెంచయ్య, మరియు పేట చిరంజీవి, డాక్టర్ నక్క ప్రసాద్, పసల సురేష్, పసల ఎలిసా, చందు, గోపి
వీర మహిళ దుర్గ పాల్గొన్నారు.

Ms
32 Lượt xem · 4 tháng trước kia

⁣*గణతంత్ర దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం*
మన భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు అనేక పోరాటాలు, త్యాగాలు, జైలు శిక్షలు చివరికి దేశం కోసం ప్రాణాలర్పించి మనకు 1947 వ సంవత్సరం ఆగస్టు 15 న స్వాతంత్రం తీసుకురావడం జరిగింది, స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశం మొత్తం కూడా బ్రిటిష్ వ్యవస్థ విధివిధానాలతో ఉన్నది, అప్పుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులపాటు ఎంతోమంది మహానుభావులు శ్రమించి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 న పూర్తి చేసినప్పటికీ 1950 జనవరి 26 న అమలులోకి రావడం జరిగింది ,కనుక ఈ దినాన్ని గణతంత్ర దినోత్సవం గా ప్రకటిస్తూ భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడుకు ప్రాథమిక హక్కులు, ఓటు హక్కు, న్యాయవ్యవస్థ విధి విధానాలు, ప్రభుత్వం ఏర్పాటు కు సంబంధించినటువంటి అనేక నియమాలు నిబంధనలు భారత రాజ్యాంగంలో నిర్మించి ప్రతి పౌరుడికి పూర్తి స్వేచ్ఛ రావడం జరిగింది, ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యానికి లోబడి ఉండాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, ప్రదీప్ కుమార్, లక్ష్మణ్, డాక్టర్ నక్క ప్రసాద్, మహేశ్, ఆరిఫ్, దినేష్, మనీ, నవీన్, గోపి, జానీ, రాజా
*వీర మహిళలు శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, నారాయణ గాయత్రి తదితరులు పాల్గొన్నారు*

Ms
11 Lượt xem · 5 tháng trước kia

⁣హెల్పింగ్ హాండ్ సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని ఐదుమంది నిరుపేద కుటుంబీకులకు ఒక్కొక్క కుటుంబానికి 5000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసిన హెల్పింగ్ అండ్ సంస్థ అధినేత మునీర్ భాష మరియు హెల్పింగ్ సంస్థ సభ్యులు.. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునిర్ భాష తో కలిసి స్వయంగా బాధితుల ఇంటి వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను తెలుసుకొని, ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా హెల్పింగ్ హాండ్సం సభ్యుడు గరికిపాటి రమేష్ మాట్లాడుతూ.
హెల్పింగ్ హాండ్స్ సంస్థ గత 15 సంవత్సరాలుగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దివ్యాంగులకు ,పేదవారికి, ప్రత్యేక ప్రతిభావంతులకు నెలసరి నిత్యవసర సరుకులను అందజేస్తూ, సేవా కార్యక్రమాలు చేపడుతుందని
అదేవిధంగా ఫ్రీ బజార్ పేరిట పేదల నివాసించే ప్రాంతానికి వెళ్లి ఉచిత సామాగ్రిని అందజేస్తూ సేవే లక్ష్యంగా ఈ సంస్థ కార్యక్రమాలు చేస్తుందని ఈ నేపథ్యంలో నేడు పేదరికంతో బాధపడుతూ అనేక అనారోగ్య సమస్యలు ఉన్న పేదవారిని గుర్తించి వారికి ఒక్కొక్క కుటుంబానికి 5000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసి వారికి కావలసిన వైద్య సదుపాయాలు అందజేసే విధంగా కార్యాచరణ కూడా చేపట్టామన్నారు. తాము పరామర్శించిన కుటుంబ సభ్యులకు ఎటువంటి వైద్య పరీక్షలు చేదల్చుకోవాలనుకుంటే
శ్రీకాళహస్తిలోని నెహ్రూ వీధినందు ఉన్న సుధా లాబ్ వెళితే అక్కడ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ హబీబ్ భాషా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, బాధితులకు తెలియజేశారు.
హెల్పింగ్ హాండ్ సంస్థ ద్వారాఆర్థిక సహాయని అందుకున్న మురళి మాట్లాడుతూ.. హెల్పింగ్ సంస్థ ద్వారా తానుకు గత 15 సంవత్సరాలుగా ప్రతినెల నిత్వసరకులు అందజేస్తుందని, ఈరోజు తన కష్టాన్ని తెలుసుకుని తన ఇంటి వద్దకే వచ్చి తనకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడంపై ఆనందం వ్యక్తం చేశారు.. ప్రార్థించే చేతులు కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే అంశాన్ని తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కల్పించండి సంస్థ అధినేత మునిర్ భాష సేవలు ఆనిర్వచనీయమని కొని ఆడారు. గతంలో తాను తన అనారోగ్య సమస్యలతో మృతి చెందాలనుకున్నానని, అయితే తనకు హెల్పింగ్ సంస్థ చేయూతని ఇవ్వడంతో, తాను నేడు జీవనం కొనసాగిస్తూ సంతోషంగా ఉన్నానన్నారు.. ఈ కార్యక్రమం నందు హెల్పింగ్ హాండ్ సంస్థ అధినేత మునీర్ భాష, హెల్పింగ్ హాండ్ సంస్థ సభ్యులు గరికిపాటి రమేష్, కోళ్ల హరి నాయుడు, హబీబ్ భాషా, బాబా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

Ms
17 Lượt xem · 5 tháng trước kia

⁣మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి నెలవారి వేతనాలు చెల్లించాలి, ఎస్రో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలి

Ms
11 Lượt xem · 5 tháng trước kia

⁣ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. ఎస్. బతైయ్య నాయుడు;
ఈరోజు శ్రీకాళహస్తి మండలంలోని గోపాలకృష్ణ పురం, ఉడవలపాడు, ముద్దముడి, ముచ్చివేలి, మంగళ పూరి, తదితర గ్రామాల్లో పర్యటించి మోదీ గారి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నిటిని వివరిస్తూ అందులో మొన్నటి రోజున పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని మార్పు చేసి ప్రతిపక్షాలు గగోలు పెట్టిన లెక్క చేయకుండా పార్లమెంటులో జిరాంజీ బిల్లును పాస్ చేయించి రాష్ట్రపతి దగ్గర సంతకం కూడా ఆగమేఘాలలో చేయించుకోవడం జరిగింది.

మోదీ గారు ఉపన్యాసాలు వాస్తవాలకు విరుద్ధంగా కోటలు దాటుతాయని, కార్యాచనాల్లో పేద ,బడుగు ,బలహీన వర్గాలకు జరిగేది శూన్యమని.
అక్కడ ప్రజలకు హామీ పథకాని ఎందుకు మార్చారు దాని వెనక ఆ పథకాన్ని నీరుగారిచే దిశలో ముందుకు పోతున్నారని దీనిని గురించి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పిలుపుమేరకు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ .ఎస్. బతైయ్య నాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని అన్ని మండలాలను తిరిగి దీనిలోని ఉన్నటువంటి నుసుగులను బయటపెడుతూ నియోజకవర్గ ప్రజలకు మోడీ గారి జిమిక్కులను తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు నిన్నటి నుండి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.


ఈ కార్యక్రమంలో; తిరుపతి జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్: జనార్దన్ రెడ్డి, వెంకట ముని,గోపి, శివయ్య, నాగూర్ అయ్యా, గురవయ్య, పెంచులమ్మ, బత్తెమ్మ, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Ms
30 Lượt xem · 5 tháng trước kia

శ్రీకాళహస్తిలో 74 వ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

Ms
28 Lượt xem · 5 tháng trước kia

⁣*అంగన్వాడి పాఠశాలకు కుర్చీలు, పిల్లలకు పలకలు, బలపం ప్యాకెట్లు వితరణ చేసిన జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం*
శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధిలోని అంగనవాడి పాఠశాలకు జన సైనికుడు *గోపి ఆధ్వర్యంలో* కుర్చీలు, పిల్లలకు పలకలు, బలపం ప్యాకెట్లు, వితరణ చేయడం జరిగింది, మరియు పిల్లలకు మంచిక్రమశిక్షణ, మంచి వాతావరణం, విద్యను అందిస్తున్న టీచర్లకు అభినందనలు తెలిపిన జనసేన పార్టీ నాయకులు,
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గోపి, డాక్టర్ నక్కా ప్రసాద్, మనీ, నవీన్, మహర్షి రెడ్డి, చందు, పసల ఎలిసా, సాయి, లోకేష్, మళ్లీ, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Ms
7 Lượt xem · 5 tháng trước kia

శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

Ms
33 Lượt xem · 6 tháng trước kia

⁣ఎపిఎన్ జిజిఓ అసోసియేసన్ తిరుపతి ఉద్యోగుల ఐక్యత వర్థిల్లాలి,అలుపెరగని శ్రామికుడు...ఉద్యోగుల ఆశాజ్యోతి...

Ms
58 Lượt xem · 6 tháng trước kia

⁣తిరుపతి జిల్లా
శ్రీకాళహస్తి


దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం నందు ప్రతియేట శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారు సంప్రదాయబద్ధంగా ఎంతో వైభవంగా రెండు పర్యాయములు సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు ఒకసారి, శివరాత్రి సమయంలో రొండోసారి గిరి ప్రదక్షణ నిర్వహిస్తారు మోతగాళ్ళచే స్వామి అమ్మవార్లను మోసుకుని గిరి ప్రదక్షణ చేస్తారు ఆ ఆదిదంపతులవెంట కొన్ని వేలసంఖ్యలో భక్త జనం గిరి ప్రదక్షణకు వెళుతుంటారు ఇదివరకు పిచ్చాటూరు మార్గంగుండా తారు రోడ్డు మీదుగా స్వామి అమ్మవార్లు భక్తులు గిరి ప్రదక్షణ చేసేవారు ఆ మార్గం గుండా వాహనాలు రాక పోకలు ఎక్కువగా ఉండడం, ప్రమాదాలు జరగడం వంటి వాటిని ద్రుష్టి లో ఉంచుకొని గిరి ప్రదక్షణకు వెళ్ళే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు కొండలను ఆనుకొని కొన్ని కోట్లు ఖర్చు చేసి రహదారిని నిర్మించడం జరిగింది కానీ ఈ మార్గంగుండా గిరి ప్రదక్షణ సమయంలో ఎక్కువ సంఖ్యలో వాహనాలు రావడం,ఆకతాయిలు, అల్లరిమూకాలు అధిక శబ్దంతో హారన్స్ కొడుతూ అతి వేగంతో బైక్స్ నడుపుతూ నడిచివేల్లే భక్తులను ఇబ్బంది పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఈ కారణం చేత కార్లు,బైక్స్,ఆటోలు వంటి వాహనాలను దేవస్థానం వారు గిరి ప్రదక్షణ కొరకు నిర్మించిన మార్గం గుండా అనుమతించకుండా పిచ్చాటూరు మార్గం తారు రోడ్డు మీదుగా ఆ వాహనాలను గిరి ప్రదక్షణ రోజు మర్లించాలని కోరుతూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ హిందూ ధార్మిక మండలి కన్వీనర్ గరికపాటి రమేష్ బాబు వారి మిత్ర బృందంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఈ.ఓ బాపి రెడ్డి, ధర్మకర్తలమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ ,ధర్మకర్తల మండలి సభ్యులు కోలా విశాలాక్షి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై వారు సానుకూలంగా స్పందిస్తూ రహదారిని పరిశీలించి తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటామని అవరమైతే రమేష్ బాబు సహాయంకుడా తీసుకుంటామని ఇటువంట మంచి సలహాలు సూచనలు తమకు ఎల్లవేళల అందించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.


ఈకార్యక్రమంలో గరికిపాటి రమేష్ బాబు, చిలకా రంగయ్య, గోపాలయ్యా,కన్నా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Ms
3 Lượt xem · 6 tháng trước kia

⁣తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మున్సిపాలిటీలో కమిషనర్ TPO శారద మొత్తం వసూల్ మాయం కావడంతో శ్రీకాళహస్తిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీనిపై ఎంక్వయిరీ చేసి జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీకాళహస్తి ప్రజలు కోరుతున్నారు. వీరిపై ఇంకా అదనపు కేసులు బనాయించాలని సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని మన యోగానంద కోరుతున్నారు

Ms
6 Lượt xem · 6 tháng trước kia

⁣సైదాపురం ను నెల్లూరు జిల్లా లో కొనసాగింపు కోసం నాలుగోరోజు సైదాపురం మండలం బంద్ విజయవంతం


సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లా లో కొనసాగించాలని కోరుతూ సైదాపురం మండలం కేంద్రం లో నిరసన దీక్షలు నాలుగో రోజు చేరుకున్న సందర్భంగా జె ఏ సి యిచ్చిన పిలుపు తో శుక్రవారం వ్యాపారాలు , స్కూల్ లు, జూనియర్ కాలేజ్ మూత పడింది.ప్రజలు స్వచ్ఛందంగా సైదాపురం ను నెల్లూరు జిల్లా లో ఉంచాలని ముందుకొచ్చి బంద్ ను పాటించారు. దీంతో సైదాపురం లో బంద్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జె ఏ సి సభ్యులు పూలే టీచర్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు తుమ్మా రవి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ నాటి ప్రభుత్వం నుండి నేటి ప్రభుత్వం వరకు జరుగుతూనే వుందన్నారు. ప్రజల అభిప్రాయం లేకుండా ఏకపక్షంగా మంత్రుల కమిటి నీ తీసుకొచ్చి సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను 40 కిలోమీటర్ల కు దూరం లో వున్న నెల్లూరు జిల్లా కేంద్రాన్ని దూరం చేసి 160 కిలోమీటర్ల దూరం లో వున్న తిరుపతి లో కలిపే విధంగా దుర్మార్గం గా ప్రకటించిందని దాన్ని వెంటనే వెనక్కి తీసుకుని మూడు మండలాలను నెల్లూరు జిల్లా లో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. జె ఏ సి కో కన్వీనర్ షఫీ హరన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మంత్రుల కమిటి పేరుతో అక్రమ నివేదికలు తెప్పించి మూడు మండలాలను తిరుపతి లో కలపాలన్న ప్రతిపాదనను ప్రజలు ఈ ప్రభుత్వం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండి పడ్డారు. ప్రజలు మూడు మండల లను కలిపే ప్రతి పాదనను వెనక్కి తీసుకోకుంటే వచ్చే ఎన్నికల్లో గుణ పాఠం తప్పదని గుర్తించాలని హెచ్చరించారు. మాదిగ దండోరా మండల నాయకులు గంగాధర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వం మూడు మండలాలను తీసి తిరుపతి లో కలిపే ప్రతి పాదన తీసుకు రావటం పట్ల ప్రజలు ఆందోళన ఆగ్రహంవ్యక్తంచేస్తున్నారన్నారు. అప్రతిపాదన ను విరమించుకుని నెల్లూరు జిల్లా
లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. జె ఏ సి మండలం కన్వీనర్ డి పి పోలయ్య మాట్లాడుతూ బడా కార్పొరేట్ శక్తులు ధనార్జన కోసం ప్రజల అభిప్రాయం లేకుండా తిరుపతి జిల్లా లో మూడు మండలాలను కలుపుకోవాలని మంత్రుల కమిటి తో చీకటి ప్రతిపాదనను తీసుకురావడం ప్రజల్లో నెల్లూరు జిల్లా లో మూడు మండలాలను కొనసాగించాలని డిమాండ్ తో పోరాటాలకు సచ్చందంగా ముందుకు వస్తున్నారన్నారు.ప్రజలు కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగలు ప్రశాంతం గా సంతోషం గా జరుపుకోవా లాంటే నెల్లూరు జిల్లా లో సైదాపురం రాపూరు కలువాయి లను యథావిధి గా నెల్లూరు లో కొనసాగించాలిలేదా గూడూరు ను జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పూలే టీచర్ ఫెడరేషన్ నాయకులు జి వి రత్నం, బి ప్రసాద్, యుటి ఎఫ్ నాయకులు పి సోమయ్య, ఆర్ వి రమణయ్య, బి జె ఏ నాయకులు వి రఘు రామ్, టి చిట్టి బాబు, కె పరంధామయ్య, ఏ పి టి ఎఫ్ నాయకులు కె రవి, ఎన్ వెంకటేశ్వర వర్మ, ఎస్ డి షరీఫ్ బాబు, ఎం చిరంజీవి,ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు కె చంగల్ రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం అనిల్ ,తదితరులు పాల్గొన్నారు.

Ms
17 Lượt xem · 6 tháng trước kia

⁣డిసెంబర్ 10వ తేదీన నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు అడ్వకేట్ డాక్టర్ ఎంఆర్ అన్సారి గారు భారత గౌరవ అవార్డును నన్ను ఎంపిక చేసి ఆహ్వానం అందించడం జరిగినది కానీ నేను నా ఆరోగ్య సమస్య వల్ల ఔరంగాబాద్ ప్రోగ్రాంకు వెళ్లలేకపోయినాను అయినా సరే సంస్థ వారు నా యొక్క సీనియార్టీ మరియు కార్యక్రమాల సేవల్ని గుర్తించి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ షేక్ షాజహాన్ సాబ్ గారి సలహాలతో రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ గారి చేతుల మీదగా భారత గౌరవ అవార్డు ను అందించడం జరిగినది నేషనల్ సంస్థ వారికి రాష్ట్ర సంస్థ వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలపడం జరిగినది అబ్దుల్ కలాం మాట్లాడుతూ మన తిరుపతి జిల్లా ప్రజలకు మరియు శ్రీకాళహస్తి ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క హక్కులను వారికి తీసి ఇవ్వడంలో వెనకాడరు అని తెలపడం జరిగినది


తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ కలాం

Cho xem nhiều hơn